- Advertisement -
ఢిల్లీ: ఓ వ్యక్తి తన భార్యను చంపి అనంతరం భార్య అదృశ్యమైందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన ఢిల్లీలోని ఆనంద్ పర్బాత్ జిల్లాలో జరిగింది. అనంతరం భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సుధీర్ అనే వ్యక్తి ఢిల్లీలో సేల్స్మెన్గా పని చేస్తున్నాడు. శనివారం నుంచి తన భార్య కనిపించడంలేదని సుధీర్ తన పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సుధీర్ చెప్పిన మాటలకు పొంతనలేకపోవడంతో అతడిపై అనుమానం కలిగింది. వెంటనే ఆమె కాల్ లిస్ట్ చూడగా భర్తతోనే పలుమార్లు మాట్లాడినట్టు గుర్తించి సుధీర్ను తనదైన శైలిలో ప్రశ్నించారు. తనకు భార్యతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని, అందుకే ఆమెను చంపి ఇంట్లో ఉన్న డ్రైనేజీలో పడేశానని వివరణ ఇచ్చాడు. దీంతో పోలీసులు భర్తను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
- Advertisement -