- Advertisement -
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో కరోనా వైరస్( కోవిడ్-19) కలకలం రేగింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్న 12మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ఇటీవలే ఓ పిజి విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో వైద్యులు టెస్టులు నిర్వహించారు. ఉస్మానియా హాస్టల్ లో ఉన్న మొత్తం 296 మందికి కరోనా పరీక్షలు చేశారు. మొత్తం 180 మంది యువతులు, 116 మంది యువకులకు కరోనా టెస్టులు చేసినట్టు అధికారులు తెలిపారు. విద్యార్థుల కరోనా టెస్టులు రిపోర్టులు రేపు వచ్చే అవకాశముంది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది.
Covid Positive for 12 students at Osmania Medical College
- Advertisement -