- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,083 కొత్త కోవిడ్-19 కేసులు, 11మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో కరోనా కేసులు 64,786కి చేరాయి. కోవిడ్ తో ఇప్పటివరకు 530 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,754 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి నుంచి 1,114 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 46,502 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా హైదరాబాద్ 578, రంగారెడ్డి 228, మేడ్చల్ జిల్లాలో 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
2083 new corona cases recorded in Telangana
- Advertisement -