- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 983 కొత్త కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా కేసులు 67,660కి చేరాయి. ఇప్పటివరకు 551 మంది ఈ వైరస్ తో చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18,500 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 48,609 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ఇప్పటివరకు 4లక్షల 87,238 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 9,443 కరోనా టెస్టులు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
983 new Covid 19 cases in Telangana
- Advertisement -