- Advertisement -
హైదరాబాద్: నగరంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలోని బంగారు మైసమ్మ ఆలయంలో దుండగులు చోరీకి యత్నించారు. అప్రమత్తమై అడ్డుకున్న ఆలయ కాపలాదారుపై ఇద్దరు దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆలయం తలుపులు, హుండీ ధ్వసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Attempted robbery at temple at ESI hospital robbery,temple, ESI hospital
- Advertisement -