Saturday, April 27, 2024

తెలంగాణలో 80వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1256 new covid 19 cases recorded in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 80వేలు దాటాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,256 కొత్త కోవిడ్-19 కేసులు, 10 మంది మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 80,751కి పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 637 మంది కోవిడ్ తో మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 22,528 యాక్టివ్ కేసులుండగా… 57,586 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో 389, రంగారెడ్డిలో 86, సంగారెడ్డిలో 74, కరీంనగర్ లో 73, వరంగల్ అర్బన్ లో 67, ఆదిలాబాద్ లో 63, కొత్త కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అటు దేశవ్యాప్తంగా కరోనా విస్తరణ వేగంగా జరుగుతోంది.

1256 new covid 19 cases recorded in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News