- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో చమురు కంపెనీలు వరుసగా ఐదో రోజు పెట్రోల్ ధరను పెంచాయి. తాజాగా భారత్ తో పెట్రో ధర 10పైసలు పెరగగా.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.81కి చేరింది. హైదరాబాద్లో లీటర్కు రూ.84.18, కొల్కతాలో రూ.82.53, ముంబయిలో రూ.87.68, చెన్నైలో రూ.84.09, బెంగళూరులో రూ.83.63, భువనేశ్వర్లో రూ.81.54, జైపూర్లో రూ.88.21, పాట్నాలో 83.68, త్రివేండం రూ.82.66కి చేరాయి. గత ఐదు రోజుల్లో పెట్రోల్ ధరలు రూ.50పైసలకుపైగా అధికమైయ్యాయి. డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో లీటర్కు రూ.73.56 ఉండగా, హైదరాబాద్లో లీటర్కు రూ.80.17గా నమోదైంది. పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Petrol Prices Hiked for the Fifth Day
- Advertisement -