- Advertisement -
చెన్నయ్: తమిళనాడు రాష్ట్రంలోని కడలూర్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు – వ్యాను ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కారులో గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని బాధితులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
four killed in road accident at tamil nadu
- Advertisement -