Monday, May 6, 2024

పోలీసుల ఎదుటే నిందితుడిని కొట్టి చంపారు…

- Advertisement -
- Advertisement -

లక్నో: ఓ ఉపాధ్యాయుడిని చంపిన నిందితుడిని గ్రామస్థులు పోలీసుల ఎదుట కొట్టి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రామ్‌పూర్ బాంగ్రాలో సుధీర్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. తన సోదరుడు అరిమాన్ సింగ్, సుధీర మధ్య గొడవలు జరుగుతున్నాయి. సుధీర్ ఇంటికి అరిమాన్ సింగ్ చేరుకొని తుపాకీతో కాల్చి చంపాడు. తుపాకీ శబ్ధం విన్న స్థానికులు సుధీర్ ఇంటికి చేరుకొని సరికొని నిందితుడు గ్రామస్థులను బెదిరించి ఇంటి పైకప్పు ఎక్కాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసుల అక్కడికి చేరుకొనిసరికి ఇంటి పైనుంచి ఓ రూమ్‌లోకి వెళ్లి దాక్కున్నాడు. కోపంతో రగిలిపోయిన గ్రామస్తులు నిందితుడిని రూమ్ నుంచి బయటకు లాక్కొంచి కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు. నిందితుడి మృతికి పోలీసులే కారణమంటూ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌ను ఎస్పీ వినోద్ మిశ్రా సస్పెండ్ చేశారు. సుధీర్‌ను ఎందుకు చంపాడో ఇంకా వివరాలు తెలియలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News