ప్రయాగ్ రాజ్: బ్యూటీషియన్ పై స్నేహితులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ప్రయాగ్ రాజ్ లోని బెనిగంజ్ ప్రాంతంలో ఉంటున్న 20 ఏండ్ల ఓ యువతి బ్యూటీషియన్ గా పని చేస్తోంది. అయితే ఆమెకు స్థానికంగా ఉన్న కొందరు యువకులతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే సులేం సారాయ్ అనే యువకుడి పుట్టినరోజు ఉందని స్నేహితులు ఆమెను ఇంటికి పిలిచాడు.
కేక్ కట్ చేసిన తర్వాత అందరూ కలిసి మద్యం సేవించారు. దీంతో యువతి మత్తులోకి జారుకుంది. ఆ సమయంలో స్నేహితులందరూ కలిసి ఆమెపై సామూహికఅత్యాచారానికి పాల్పడ్డారు. మత్తులోంచి కోలుకున్న ఆమెకు ఏం జరిగిందో అర్థం కాలేదు. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సరికి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.