- Advertisement -
మనతెలంగాణ/జ్యోతినగర్: ఎన్టిసిపి నుంచి రామగుండం వెళ్తున్న బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఎండి బషీర్ అనే వ్యక్తి ఎన్టిపిసి నుంచి మోటార్ బైక్పై వెళ్తుండగా బి పవర్ హౌస్ సమీపంలో రాజీవ్ రహదారిపై వెళ్తూ రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఆర్టీసి బస్సు ఢీకొట్టడడంతో ఘటనా స్థలంలో అతడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు బషీర్ రామగుండం హౌసింగ్కాలనీకి చెందిన వ్యక్తి అని, ఎన్టిపిసి చికెన్ సెంటర్లో నిర్వహిస్తుంటాడని తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -