తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్లు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రులకు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మంత్రులు హరీష్రావు, గంగుల కమలాకర్, కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మంత్రులు హరీష్రావు, గంగుల కమలాకర్లతో పాటు సుడా ఛైర్మన్ జి.వి.రామకృష్ణారావు, కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, బోనాల శ్రీకాంత్, నాయకులు కోల ప్రశాంత్, గౌతమ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Harish Rao And Gangula Kamalakar Visit Tirumala Tirupati