- Advertisement -
హైదరాబాద్: రుణ యాపుల వేధింపుల కేసులో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు పుణెలో అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరుశురామ్ తో పాటు భార్య లియాంగ్ టియాన్, అనుచరుడు షేక్ ఆకిబ్ ను అరెస్టు చేసినట్టు రాచకొండ సిపి మహేష్ భగవత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ రుణ యాప్ కాల్ సెంటర్ ను మహరాష్ట్రలో నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. నిందితుల నుంచి 101 ల్యాప్ టాప్, 106 సెల్ ఫోన్లు, సిసిటివిల డివిఆర్ లు స్వాధీనం చేస్తున్నామని చెప్పారు. రుణయాప్ కంపెనీ బ్యాంకు ఖాతాలకు చెందిన రూ.1.42 కోట్ల లావాదేవీలు నిలిపివేసినట్టు రాచకొండ సిపి పేర్కొన్నారు.
- Advertisement -