- Advertisement -
అనంతపురం: వైసిపి ఎంఎల్ఎ సజ్జల రామకృష్ణ రెడ్డి తనని చంపించాలని చూస్తున్నారని తాడిపత్రి మాజీ ఎంఎల్ఎ జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. సజ్జల చెప్పినట్టు పోలీసులు వింటున్నారని, సిసి ఫుటేజీ తీసుకొని కేసు పెట్టమంటే పోలీసులు ఒత్తిళ్లు ఉన్నాయని అంటున్నారని మండిపడ్డారు. తాను కేసు పెడితే పోలీసులు సస్పెండ్ అవుతారన్నారు. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదన్నారు. తాను ప్రజల మనిషినని, ప్రజల్లోనే ఉంటా చంపుతావా? అని సవాలు విసిరారు. చంబల్ లోయల్లో ఉండాల్సిన వాళ్లు తాడిపత్రిలో ఉన్నారని మండిపడ్డారు. ఎపిలో పోలీసులు మారాల్సిన అవసరం ఉందన్నారు.
- Advertisement -