Monday, April 29, 2024

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎను అడ్డుకున్న కాంగ్రెస్, సిపిఎం

- Advertisement -
- Advertisement -

చౌటుప్పల్: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారంలో ఎంఎల్‌ఎను అడ్డగించారు. ఎంఎల్‌ఎ ప్రభాకర్ రెడ్డిని సిపిఎం, కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. గతంలోని పనులు పూర్తి చేయకుండా మళ్లీ శిలాఫలకాలు వేయడం ఏంటని ఎంఎల్‌ఎను గ్రామస్థులు ప్రశ్నించారు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి గ్రామాలలో పలు పనులు చేయకపోవడంతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలను యువత అడ్డుకోవడంతో పాటు ప్రశ్నిస్తున్నారు. తొమ్మిది సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారని ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాల చెరువులకు కాలువలు లేకపోవడంతో హామీ ఇచ్చి పనులు చేయకపోవడంతో యువత ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

Also Read: కూతురిని వేధించారని… ఇద్దరు యువకులను చంపి.. బస్తాలో మూటకట్టి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News