Wednesday, May 22, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్….

- Advertisement -
- Advertisement -

England loss four wickets for 88 runs

చెన్నై: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో ఇంగ్లాండ్ జట్టు 36 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 88 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. 394 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ గెలిచే అవకాశం ఉంది. ఇంకా ఒక్క రోజు ఆట మిగిలి ఉంది. నాలుగో రోజు అద్భుతమైన స్టంప్‌తో లారెన్స్‌ను పంత్ వెనక్కి పంపాడు. అశ్విన్ బౌలింగ్‌లో లారెన్స్ ముందుకెళ్లి ఆడాడు బంతి మిస్ కావడంతో అంతే వేగంతో పంత్ స్టంప్‌ఔట్ చేశాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో రోరీ బర్న్ (25), డానియల్ లారెన్స్(26), డొమినిక్ సిబ్లే (03) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో జోయ్ రూట్ (20), బెన్ స్టోక్స్ (08) బ్యాటింగ్ చేస్తున్నారు. జాక్ లీచ్ పరుగలేమీ చేయకుండా డకౌట్ రూపంలో మైదానం వీడాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, అక్షర పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News