Sunday, May 12, 2024

కూతురుతో మాట్లాడుతున్నాడని.. యువకుడిపై దాడి

- Advertisement -
- Advertisement -

Family members cut off a man's arms and legs in Guntur

అమరావతి: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరులో బుధవారం దారుణం చోటుచేసుకుంది. కూతురుతో మాట్లాడుతున్నాడని ఒక యువకుడిపై కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యువతి కుటుంబీకులు యువకుడి కాళ్లు, చేతులను నరికేశారు. గమనించిన స్థానికులు యువకుడిని ఆస్పత్రికి తరలించారు. గుంటూరు జిజిహెచ్ చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. మృతుడిని వెంకటేష్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుమారైను ప్రేమించాడనే ఆగ్రహంతోనే ఈ హత్య చేశారని పోలీసులు తెలిపారు.

Family members cut off a man’s arms and legs in Guntur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News