- Advertisement -
మెదక్: రామాయంపేట మాజీ శాసన సభ్యుడు, మాజీ శాసన మండలి సభ్యుడు, మాజీ జెడ్పీ చైర్మన్ రాజయ్యగారి ముత్యంరెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో జన్మించారు. 1978లో రామాయంపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. 1980లో అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య కోసం ముత్యంరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కామారం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
- Advertisement -