Thursday, May 16, 2024

యుపిలో 50కి చేరిన డెంగ్యూ మరణాలు

- Advertisement -
- Advertisement -

Dengue deaths reach 50 in UP

 

ఫిరోజాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో డెంగ్యూ జ్వరంతో శుక్రవారం ముగ్గురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 50కి చేరింది. జిల్లాలోని పది ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు నమోదయ్యాయని చీఫ్ మెడికల్ ఆఫీసర్ దినేశ్‌కుమార్‌ప్రేమీ తెలిపారు. జిల్లాలో 36 చోట్ల క్యాంపులు నిర్వహిస్తున్నామని, జ్వరంతో బాధపడుతున్న 3719మందికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రోగులకు చికిత్స అందించడంలో నిర్లక్షం వహించినందుకు ముగ్గురు డాక్టర్లను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. డెంగ్యూ కేసులు పొరుగు జిల్లాలైన మథుర, ఎటాహ్, మెయిన్‌పురిలోనూ నమోదవుతున్నాయని సీనియర్ వైద్యాధికారి ఒకరు తెలిపారు. తనకున్న సమాచారంమేరకు మృతుల సంఖ్య 61 అని బిజెపి ఎంఎల్‌ఎ మనీష్‌అసీజా తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News