- Advertisement -
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి ఆదివారం సాయంత్రం 520కి డిశ్చార్జ్ అయ్యారు. అక్టోబర్ 13న సింగ్ ఎయిమ్స్లో చేరారు. జ్వరం రావడంతో ఆయన ఎయిమ్స్లో చేరినట్టు వైద్యులు ఆ సందర్భంగా తెలిపారు. గుండెకు సంబంధించిన సమస్యలున్నందున 89 ఏళ్ల మన్మోహన్సింగ్కు డాక్టర్ నితీశ్ నాయక్ నేతృత్వంలోని కార్డియాలజిస్టుల బృందం చికిత్స నిర్వహించింది. హాస్పిటల్లో ఉండగా కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్సుఖ్ మాండవ్య సింగ్ను పరామర్శించారు.
- Advertisement -