Monday, May 6, 2024

‘శశివదనే’ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

రక్షిత్ అట్లూరి హీరోగా గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్న సినిమా ‘శశివదనే’. కోమలీ ప్రసాద్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు మారుతి క్లాప్ ఇచ్చారు. సంగీత దర్శకులు రఘు కుంచె కెమెరా స్విచ్చాన్ చేశారు.

నిర్మాత శరత్ మరార్ తదితర ప్రముఖులు ఈ ముహూర్త కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ డిసెంబర్ నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తున్నామని చెప్పారు. హీరో రక్షిత్ మాట్లాడుతూ మంచి ప్రేమకథా చిత్రమిదని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:సాయికుమార్ దార, సాహిత్యం:కిట్టు విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం: శరవణ వాసుదేవన్.

‘Shashivadane’ Movie Launch in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News