Tuesday, April 30, 2024

ఇష్టం లేని కోర్సు… చింతల్ చెరువులో విద్యార్థి దూకి….

- Advertisement -
- Advertisement -

Student commit suicide over education

మేడ్చల్: అదృశ్యమైన విద్యార్థి చెరువులో శవంగా కనిపించిన సంఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని గాజులరామారం చింతల్‌లో జరిగింది. సదరు విద్యార్థి మృతదేహం చింతల్ చెరువులో కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుమిత్ (17) తన తల్లిదండ్రులతో కలిసి షాపూర్ నగర్ లో ఉంటున్నాడు. ఇంటర్ ఫస్టియర్ ఎంపిసిలో తల్లిదండ్రులు సుమిత్ ను చేర్పించారు.  ఎంపిసిలో చేరడం ఇష్టం లేకపోవడంతో మళ్లీ సిిఇసిలో చేర్పించారు. మనస్తాపం చెందిన సుమిత్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. చింతల్ చెరువు వద్ద చెప్పులు కనిపించడంతో పోలీసులు చెరువులో గాలించగా యువకుడి మృతదేహం కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News