Saturday, May 4, 2024

వివేకా హత్య కేసులో కొత్త కోణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడని భాస్కర్ రెడ్డి తరుపు న్యాయవాది పేర్కొ న్నారు. దస్తగిరి అప్రూవర్‌ను సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై వాదనలు వినిపించారు. సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురిచేశాడని వాదనల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో కక్ష కట్టి సునీల్ యాదవ్ వివేకా తలపై దాడి చేసి హత్య చేశాడని పిటిషనర్ తరుపు న్యాయవాది పేర్కొ న్నారు. అలాగే ఈ కేసులో ఎస్‌పి రాంసింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వెళ్లారని, రాంసింగ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తమను ఇరికిస్తున్నారని నిందితుడు భార్య తులసమ్మ వాదనలు వినిపించింది.

దీంతో రామ్‌సింగ్ వ్యవహారంపై అనుమానాలు రావడంతో కొత్త ఐవోను నియమించింద న్నారు. కొత్తగా నియమించిన సిట్ వివరాల ఆర్డర్ కాపీ ఉందా అని వాదనలు విన్న న్యాయస్థానం ప్రశ్నించింది. నూతనంగా నియమించిన సిబిఐ సిట్ టీమ్ అధికారుల వివరాలను పిటిషనర్ తరుపు న్యాయవాది ఇచ్చారు. గూగుల్ టెక్ ఔట్‌ను ఆధారంగా చేసుకొని ఎలా తమను కేసులో పెడతారని ప్రశ్నించారు. సిబిఐ, సునీత కలిసిపోయి దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారని వాదనల్లో ఆరోపించారు. తదుపరి విచారణ గురువారంకి కోర్టు వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News