Monday, April 29, 2024

పెళ్లికి నిరాకరించడంతో యువతిపై కత్తితో దాడి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/కరీంనగర్ రూరల్: పెళ్లికి నిరాకరించడంతో యువతిపై కత్తితో దాడి చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. కొత్తపల్లి పట్టణానికి చెందిన యువతిని గత నాలుగు సంవత్సరాల నుంచి అదే పట్టణానికి చెందిన బొద్దుల సాయి (28) ప్రేమిస్తున్నానని యువతికి మెసేజ్‌లు పంపిస్తున్నాడు. ఈ విషయమై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి సర్ది చెప్పారు.

అయినా బొద్దుల సాయి తీరుమారకపోగా తనను పెళ్లి చేసుకోవాలని యువతిని వేధిస్తున్నాడు. అయితే యువతి పెళ్లికి నిరాకరించిందని మనసులో కక్ష పెట్టుకున్న సాయి గురువారం సాయంత్రం యువతిపై దాడి చేసి కత్తితో గొంతుకోశాడు. దీంతో యువతిని స్థానికులు కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ప్రదీప్‌ కుమార్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News