- Advertisement -
న్యూఢిల్లీ: యుపిఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ఓ యువతి సోషల్ మీడియాలో ఇద్దరు మహిళా ఐపిఎస్ ఉద్యోగుల గురించి అసభ్యకరంగా పోస్టు పెట్టిన సంఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుజాత సాహు(33) అనే వివాహిత మహిళ గత కొన్ని సంవత్సరాల నుంచి యుపిఎస్సి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతోంది. ఆమెకు భర్తతో విభేదాలు రావడంతో ఒంటరిగా ఉంటూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతోంది. ట్విట్టర్లో ఓ ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి ఇద్దరు మహిళా ఐపిఎస్ ఆఫీసర్ల గురించి అసభ్యకరమైన పోస్టులు పెట్టింది. దీంతో అసభ్యకరమైన పోస్టులను గమనించిన ఐపిఎస్ ఆఫీసర్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి ఐపి అడ్రస్ ద్వారా సదరు మహిళను గుర్తించారు. వెంటనే సుజాతను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
- Advertisement -