- Advertisement -
ముంబయి: మహారాష్ట్రలోని పూణేలో ఓ బాలుడు టివిలో కార్టూన్లు చూడనివ్వడంలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…… బిబ్వివాడి ప్రాంతంలోని రాజీవ్ గాంధీ నగర్లో బాలుడి నాన్నమ్మ టివిలో న్యూస్ చూస్తున్నప్పుడు… కార్టూన్లు చూడాలని 14 ఏళ్ల బాలుడు ఛానల్ మార్చాడు. దీంతో ఇద్దరు మధ్య కొంచెం సేపు గొడవ జరిగింది. ఇది గమనించిన బాలుడి తల్లి టివిని ఆఫ్ చేసింది. వెంటనే బాలుడు తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. స్కార్ఫ్ తీసుకొని ఇంట్లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. కొంచెం సేపు తరువాత కుటుంబ సభ్యులు గమనించి బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు అక్కడి చేరుకొని సాధారణ మరణంగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాలుడు ఏడో తరగతి చదువుతున్నాడు.
- Advertisement -