- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. జూలై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో పది పరీక్షలు రద్దు చేసినా.. ఎపిలో మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించి పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.
AP 10th Class Exams to held on July 10
- Advertisement -