Tuesday, April 30, 2024

ఏడో అంతస్తు నుంచి పడి ఎసి టెక్నీషియన్ మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలో ఆదివారం ఓ యువకుడు మృతి చెందాడు. అపార్ట్ మెంట్ ఏడో అంతస్తు నుంచి ఎసి టెక్నీషియన్ కిందపడిపోయాడు. యువకుడికి తీవ్రగాయాలు కావడంతో తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News