Monday, May 6, 2024

అత్యాచారయత్నం… చింతచెట్టుకు ఉరేసుకున్న నిందితుడు

- Advertisement -
- Advertisement -

 

 

చెన్నై: అంబులెన్స్ డ్రైవర్ 15 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారయత్నానికి పాల్పడి అనంతరం ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని తిరువన్నమళైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అజివిదైతంగీ ప్రాంతంలో థామస్ అనే వ్యక్తి అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేసేవాడు. పెరూన్‌గట్టూరు గ్రామంలో ఓ టీ షాపుకు ప్రతిరోజు వెళ్తుండేవాడు. టీషాపులో ఉన్న 15 ఏళ్ల అమ్మాయితో పరిచయం పెంచుకొని ప్రేమలోకి దింపాడు. అనంతరం బాలికతో కలిసి పలుమార్లు బయటకు వెళ్లాడు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో కూతురును హెచ్చరించారు. ఈ విషయం థామస్‌కు బాలిక చెప్పడంతో సీక్రెట్ స్థలానికి రమ్మని కబురుపంపాడు. అక్కడికి రాను అని నిరాకరించడంతో తనతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. ఆమె అక్కడికి వెళ్లగానే అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారం చేయడానికి థామస్ ప్రయత్నించాడు. ఆమె అక్కడి నుంచి తప్పించుకొని కుటుంబ సభ్యులకు తెలపడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తుండగా గ్రామ శివారులో చింత చెట్టుకు ఉరేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. బాలిక కుటుంబం సభ్యుల వేధింపులతో థామస్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యుల ఆరోఫణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News