- Advertisement -
న్యూఢిల్లీ: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ముంబైలో నమోదైన మూడు కేసులను హిమాచల్ ప్రదేశ్ కు బదిలీ చేయాలని కంగనా కోర్టును కోరింది. ముంబైలో కేసుల విచారణకు హాజరుకావడం తన ప్రాణానికి ముప్పు, శివసేన నేతల నుంచి ప్రాణాహాని ఉన్నందున బదిలీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ కారణంగా ముంబై కోర్టులో తనపై ఉన్న 3 కేసులను తన సొంత రాష్ట్రమైన హిమాచల్ప్రదేశ్ కు బదిలీ చేయాలని కంగన తరపున న్యాయవాది నీరజ్ శేఖర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, సోషల్ మీడియా ద్వారా మతపరమైన విమర్శలు చేసినందుకు గానూ, కంగనాతో పాటు ఆమె సోదరిపై క్రిమినల్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
Actor Kangana Ranaut moves Supreme Court
- Advertisement -