- Advertisement -
కరోనా లాక్ డౌన్ మూలంగా దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న ఈ సమయంలో నేచురల్ స్టార్ నాని రక్తదానం చేయడం విశేషం. లాక్ డౌన్ మూలంగా రక్తం లభించకపోవడంతో పలువురు రోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో నాని ముందుకు వచ్చి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ కోసం రక్త దానం చేశారు. ఆయన చేసిన ఈ రక్తదానం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు.
Actor Nani donated Blood
- Advertisement -