- Advertisement -
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనా వైరస్ తో బుధవారం రాత్రి దుర్మరణం చెందాడు. సెప్టెంబర్ 2న కరోనా వైరస్ సోకడంతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. కరోనా నెగిటివ్ వచ్చాక కూడా ఆయన కోలుకోలేదని పేర్కొన్నారు. ఆయన భార్య, కుమారుడు ఉన్నాడు. ఎఫ్ సిఐలో మేనేజర్ గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. ఛలో, పిల్లజమిందారు, మర్యాద రామన్న చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
- Advertisement -