Monday, April 29, 2024

రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో అడివి శేష్

- Advertisement -
- Advertisement -

Adivi Sesh with Defence Minister Rajnath Singh

జాన్ దూంగా దేశ్ నహీ…

ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో అడివి శేష్ ‘మేజర్’ సినిమా ఒకటి. 26/11 హీరో, ఎన్‌ఎస్‌జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా మేకర్స్ దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హీరో అడివి శేష్, దర్శకుడు – శశి కిరణ్ తిక్కా ఢిల్లీలో రక్షణ మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను ప్రదర్శించి, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ గురించి మాట్లాడారు. ఇదే సందర్భంలో రాజ్‌నాథ్ సింగ్ మేజర్ సినిమా నినాదాన్ని ఆవిష్కరించారు. తెల్లటి కాన్వాస్‌పై ‘జాన్ దూంగా దేశ్ నహీ’ అనే ఫోటో ఫ్రేమ్‌ని విడుదల చేశారు.

ఈ నినాదం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ధీరత్వానికి అద్దం పట్టింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు కథను చూపించబోతున్న దర్శకుడు శశి కిరణ్ తిక్క, అడివి శేష్‌లను అభినందించారు. ఇక చిత్ర యూనిట్ రక్షణ మంత్రి, ఆయన కుటుంబ సభ్యుల కోసం సినిమా ప్రత్యేక స్క్రీనింగ్‌ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ప్రముఖ తారాగణంగా కనిపించబోతున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా భారీగా నిర్మిస్తోంది. ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News