Sunday, April 28, 2024

బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై భూ వివాద ఆరోపణలు

- Advertisement -
- Advertisement -
Allegations of land dispute against BJP MLA Raja Singh
బిజెపి ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై భూ వివాద ఆరోపణలు.. ఏం జరగనుందో..?

హైదరాబాద్: గోషామహల్ ఎంఎల్‌ఎ రాజాసింగ్‌పై సోషల్ మీడియా వేదికగా మాజీ కార్పోరేటర్, టిఆర్‌ఎస్‌కు చెందిన ముఖేష్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళ్‌హాట్ డివిజన్ పరిధిలోని దిలావర్ గంజ్‌లో ఉన్న నాలుగు వందల రెండు గజాల భూమి విషయంలో వీరి మధ్య వివాదం రాజుకుంది. సదరు భూమి ప్రభుత్వ స్థలమని ఎంఎల్‌ఎ ఆసిఫ్‌నగర్ తాసీల్దార్‌కు లేఖ రాశారని, అధికారులు అది ప్రైవేటు స్థలమని నిర్ధారించారని మాజీ కార్సొరేటర్ ముఖేష్ సింగ్ ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన.. ఎంఎల్‌ఎ తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే అన్యాయం చేస్తున్నారని, వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఎంఎల్‌ఎగా గెలిచిన నాటి నుంచి రమేష్ పట్టేదార్ బోరు వేసే విషయం మొదలు కొన్ని మగ్రా, దూల్పేట్‌లలో స్థల వివాదాలు, హజారే భవన్ కూల్చివేయాలని తదితర అంశాల్లో ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

లోథ్ సమాజ్ యువత ఒకసారి ఆలోచించి, వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉందంటూ వీడియో పోస్ట్ చేశారు. దీనిపై ఎంఎల్‌ఎ రాజాసింగ్ స్పందిస్తూ.. తన సామాజిక వర్గానికే చెందిన వారు వచ్చి ల్యాండ్ విషయంలో ఫిర్యాదు చేయగా, ఆ స్థలం ప్రైవేట్‌దా? ప్రభుత్వ స్థలమా? అని నిర్ధారించాలని తాసిల్దార్‌కు లేఖ రాశానని అన్నారు. సమస్య ఉందని తన వద్దకు వచ్చే వారికి న్యాయం చేసేందుకు లేఖ ఇచ్చానని, అయినా తనను ప్రశ్నించే అధికారం ముఖేష్ సింగ్‌కు లేదన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని ఆయన మరో వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ముఖేష్ సింగ్ మాట్లాడుతూ ఎంఎల్‌ఎ వల్ల నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బాధితుల పక్షాన ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ముఖేష్ సింగ్ మాట్లాడుతూ ఇదే స్థలం విషయంలో 2019లో కొందరు వచ్చి రూ.20 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఎంఎల్‌ఎ వేధింపులకు బిజెపి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News