Thursday, May 16, 2024

ఆలు బిడ్డలు, అత్తతో సహా ఐదుగురిని చంపి, వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Alok Masulkar killed 5 members of family, dies by suicide

 

నాగ్‌పూర్ : మహారాష్ట్ర లోని నాగ్‌పూర్ సిటీలో ఓ వ్యక్తి దారుణానికి ఒడి గట్టాడు. సోమవారం తెల్లవారు జామున నాగ్‌పూర్ లోని పచ్‌పవోలీ ఏరియాలో అలోక్ మత్‌కార్ అనే వ్యక్తి తన భార్య విజయ (40) గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత కుమార్తె పారి (14), కొడుకు సాహిల్ (12)ల గొంతు కోసి హతమార్చాడు. ఆ తరువాత అత్తగారింటికి వెళ్లి అత్త లక్ష్మీబోబ్డే (55), మరదలు అమీషా బోబ్డే (21)లను గొంతులు కోసం చంపేశాడు. ఆ తరువాత తిరిగి తన ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 9 గంటలైనా ఎవరూ బయటికి రాకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చి కిటికీ లోంచి చూడగా రక్తపు మడుగులో మృతదేహాలు పడి ఉన్నాయి. పోలీసులు ఇంటి తలుపులు పగుల గొట్టి శవాలను పోస్టుమార్టమ్‌కు పంపారు. టైలరింగ్‌తో బతుకు గడుపుతున్న మతూకర్ కుటుంబ తగాదాల వల్లనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోందని పోలీసులు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News