Saturday, April 27, 2024

అమెరికాలో కాల్పులు… 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం జోలియెట్ నగరంలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి.  మెడిసన్ వీధిలోని వెస్ట్ అక్రాస్ రోడ్డులోని 2200 బ్లాక్ లో గత రెండు రోజుల నుంచి నిందితుడు వేర్వేరు ఇళ్లపై కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. కాల్పులు జరిపిన వ్యక్తి రోమియో నాన్స్‌గా పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వెంటనే రోమియో రెడ్ కలర్ టయోటా కారులో అతడు తప్పించుకున్నాడు. మృతుల కుటుంబ సభ్యులతో నిందితుడికి పరిచయం ఉన్నట్టు సమాచారం. రోమియో ఎక్కడి కనిపించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని అమెరికా పౌరులకు పోలీసులు అధికారులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News