Wednesday, May 1, 2024

బెదిరించిందని డిజైనర్‌పై అమృతా ఫడ్నవీస్ కేసు

- Advertisement -
- Advertisement -

ముంబై : అనిక్ష అనే ఓ డిజైనర్ తనను బెదిరిస్తోందని, బ్లాక్‌మెయిల్ చేసేందుకు యత్నించిందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ పోలీస్ కేసు పెట్టారు. ఫిబ్రవరి 20న చేసిన ఫిర్యాదులో ఆ మహిళ తండ్రిని కూడా చేర్చారు. ఆమె తండ్రికి సంబంధించిన క్రిమినల్ కేసులో జోక్యం చేసుకోవడానికి రూ. కోటి ఇవ్వజూపిందని కూడా ఆరోపించారు.

2021 నవంబర్‌లో నన్ను అనిక్ష కాంటాక్ట్ అయింది. తానొక డిజైనర్‌నని పరిచయం చేసుకుంది. బయట జరిగే కార్యక్రమాల్లో తన డిజైనర్ దుస్తులు, ఆభరణాలు, చెప్పులు ధరించాలని కోరింది. దాని వల్ల తన ఉత్పత్తులకు ప్రచారం లభిస్తుందని చెప్పింది. ఆమె చెప్పిన మాటలు నమ్మి నేను అలాగే అన్నాను. నాతో మొదటి పరిచయం లోనే తన కుటుంబ విషయాలు వెల్లడించింది. తనకు తల్లి లేదని చెప్పింది.

తర్వాత ప్రతిసారి నా సిబ్బందికి తన ఉత్పత్తులు ఇచ్చి, నాకు చేర్చమని చెప్పేది. వాటిని బహిరంగ కార్యక్రమాల్లో ధరించమని కోరేది. అయితే ఏదైనా కార్యక్రమంలో వాటిని ధరించానో లేదో నాకు గుర్తు లేదు. మళ్లీ వాటిని ఆమెకు ఇచ్చేయమంటూ నా సిబ్బందికి చెప్పాను. ఇప్పుడు ఆమెకు సంబంధించిన వస్తువులేవీ నా దగ్గర లేవు.” అని ఫిర్యాదులో అమృత పేర్కొంది.

రూ. కోటి ఇస్తామని చెప్పింది: అమృత

“ ఇంకోసారి కలిసినప్పుడు తన తండ్రికి పలు రాజకీయ పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయని చెప్పింది. నా సిబ్బంది ద్వారా ఓ కవర్‌ను నాకు అందించింది. దాన్ని నేను తెరిచి చూస్తే … అందులో చేతిరాతతో ఉన్న నోట్ కనిపించింది. అందులో ఉన్నదేమిటో అర్థం కాక పక్కన పెట్టేశాను. తర్వాత ఓ రోజు నా భద్రతా సిబ్బందిని ఏమార్చి నా కారులో కూర్చుంది. బుకీస్ గురించి తన తండ్రి పోలీసులకు సమాచారం ఇస్తాడని, దాంతో ఎలా డబ్బు సంపాదించవచ్చో చెప్పింది. దాంతో నేను వెంటనే కారు ఆపి , ఆమెను దించేశాను.

ఫిబ్రవరి 16న నాకు ఫోన్ చేసి తన తండ్రి కేసు గురించి చెప్పి, అతడిని కేసు నుంచి బయటపడేస్తే రూ.కోటి ఇస్తానని మాట్లాడింది. ఆ మాట వినగానే నేను ఫోన్ కట్ చేసి, నంబర్ బ్లాక్ చేశాను. ఇక ఫిబ్రవరి 18.19 తేదీల్లో ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో క్లిప్స్, వాయిస్ మెసేజ్‌లు పంపింది” అని అమృత తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అనిక్ష ఆమె తండ్రిపై కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుపై తగిన విచారణ జరుపుతామని గురువారం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News