- Advertisement -
హైదరాబాద్ : డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో(అక్టోబర్డిసెంబర్) ఫలితాల్లో ఆంధ్రా బ్యాంక్ రాణించింది. బ్యాంక్ నికర లాభం రూ.163 కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.529 కోట్లు నష్టాల్లో ఉంది. అలాగే బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.5,322 కోట్ల నుంచి రూ.5,595 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.1698 కోట్ల నుంచి రూ.1775 కోట్లకు పెరిగింది. ప్రొవిజన్లు రూ.1226 కోట్లతో 32 శాతం తగ్గాయి. గతేడాది ఇదే సమయంలో కేటాయింపులు రూ.1,808 కోట్లు కోట్లుగా ఉన్నాయి. స్థూల ఎన్పిఎ(నిరర్థక ఆస్తులు) 16.21 శాతం నుంచి 17.26 శాతానికి పెరిగాయి. నికర ఎన్పిఎ 5.73 శాతం నుంచి 6.36 శాతానికి పెరిగాయి.
Andhra Bank has a net profit of Rs 163 crore
- Advertisement -