- Advertisement -
చెన్నై: అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన తలపతి విజయ్పై ఆదాయ పన్ను ఎగవేత కేసుకు సంబంధించి విచారణ ప్రారంభం కానున్నది. 2019లో విజయ్ నటించిన బిజిల్ చిత్రం ప్రపంచం మొత్తం మీద రూ.300 కోట్లు తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని ఎజిఎస్ సినిమాస్ అనే సంస్థ నిర్మించింది. ఎజిఎస్ సినిమా ఆస్తులపైన, ఫిలిం ఫైనాన్షియర్ అంబు చెలియన్ నివాసం పైన మధురైలో ఆదాయం పన్ను శాఖ దాడులు జరిగాయి. నైవేలీ బొగ్గు గనుల వద్ద షూటింగ్ లో ఉన్న విజయ్ వద్దకు ఆదాయం పన్ను అధికారులు చేరుకుని సమన్లు జారీ చేశారు. చెన్నైకు ఆయన రాగానే విచారణ ప్రారంభిస్తారు.
IT Officials attack on Thalapathy Vijay
- Advertisement -