Wednesday, May 1, 2024

ఆంధ్రా బ్యాంకులో బంగారం గోల్‌మాల్…

- Advertisement -
- Advertisement -

gold

అమరావతి: గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడులోని ఆంధ్రాబ్యాంకులో బంగారం గోల్ మాల్ జరిగింది. బ్యాంకులో ఉండాల్సిన బంగారం మణప్పురం గోల్డ్ లో ప్రత్యక్షమైంది. మణప్పురం గోల్డ్ అప్రయిజర్ పేరుతో సుమారు కేజీన్నర బంగారం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం జోనల్ ఆఫీసర్ ఉన్నతాధికారులు బ్యాంకులో విచారణ జరుపుతున్నారు. బంగారం మాయం సమాచారంతో రైతులు, ఖాతాదారులు ఆందోళనలో ఉన్నారు. ఈ ఘటనలో బ్యాంకు అధికారులు పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాంకు అధికారులను పోలీసులు విచారిస్తున్నారు. బ్యాంకులో ఇంకా ఎంత బంగారం ఉంది. ఎంత మాయం అయిందని అనే దిశగా రికార్డులు చెక్ చేస్తున్నారు. అసలు బంగారం బయటకు ఎలా వెళ్లిందని అనుమానంతో అధికారులు సిసిటివి కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Gold Scam in Guntur Prathipadu Andhra Bank

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News