Saturday, April 27, 2024

కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపిన కసాయి కొడుకు..

- Advertisement -
- Advertisement -

కన్నతల్లి అని చూడకుండా.. ఓ కసాని కొడుకు గొడ్డలితో నరికి చంపిన దారుణ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. రేగొండ మండలంలోని తిరుమలగిరిలో హైమా(70) అనే వృద్ధురాలిపై ఆమె కొడుకు రాజిరెడ్డి గొడ్డలితో నరికి చంపారు.

అడ్డుకోబోయిన మరో మహిళపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీంతో చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News