Saturday, May 4, 2024

తెలంగాణ బోట్లను అడ్డుకుంటున్న ఆంధ్రోళ్లు

- Advertisement -
- Advertisement -

 

కృష్ణా తీరంలో తెలంగాణ మర బోట్లకు “లంగరు”
కృష్ణా నదిలో ఆంధ్ర బోట్ల “బడాయి”
తెలంగాణ బోటు నిర్వాహకులతో “లడాయి”
ఇరు రాష్ట్రాల బోటు నిర్వాహకుల తీరుతో ప్రయాణికుల ఇక్కట్లు
ఆంధ్ర తెలంగాణ మధ్య నిలిచిన ప్రయాణం

హైదరాబాద్: కృష్ణా నది తీరంలోతెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రయాణికులను చేరవేసే మరబొట్లకు ” లంగరు ” పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రైవేటు బోటు నిర్వాహకులు తెలంగాణ ప్రాంత బోట్లను అడ్డుకుంటున్నారు. దీంతో తెలంగాణ నుంచి రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, సంగమేశ్వరాలయానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనాదిగా పుట్టిల నుంచి మర పడవల వరకు ఆటుపోట్లను అధిగమిస్తూ ప్రయాణికులను చేరవేసిన తెలంగాణ మర బోటు నిర్వాహకులు ఆంధ్ర ప్రాంత పెత్తందారుల తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతులు లేకుండా నడుస్తున్న మరబొట్ల వాహకుల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News