Wednesday, May 1, 2024

పెళ్లై ఏడు నెలలు… యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెళ్లైన ఏడు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేనెలలో ప్రతాప్ నాయక్ అనే యువకుడు చంద్రకళాబాయి(19)ని వివాహం చేసుకున్నాడు. వివాహం కాకముందే అత్త చనిపోవడంతో మామ, భర్తతో కలిసి ఉంటుంది. గత కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో చంద్రకళాబాయి మనస్థాపానికి గురైంది. ఈ నెల 13న మామ, భర్త వ్యవసాయ క్షేత్రానికి వెళ్లడంతో ఆమె పురుగుల మందు తాగింది. వెంటనే స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆమె దుర్మరణం చెందిందని ఎస్‌ఐ విజయ్ కుమార్ పేర్కొన్నారు. దీంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News