Friday, May 17, 2024

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: అన్నమయ్య జిల్లా కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఢీకొని నలుగురు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు లక్షణమ్మ(66), నర్సయ్య(58), రాజారెడ్డి(45), చిన్నక్క(60)గా గుర్తించారు. మృతులు కడప జిల్లా బద్వేల్‌కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డుపైన వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Also Read: వివేకా హత్య కేసు: ఉదయ్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News