Saturday, April 27, 2024

రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు

- Advertisement -
- Advertisement -
another 12 omicron cases are new in telangana
79కి చేరిన కేసుల సంఖ్య
కోలుకున్న ఒమిక్రాన్ బాధితులు 27 మంది

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 123 మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జిఐఎ) చేరుకున్నారు. వారందరికీ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా, 10 మంది ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. ఇప్పటివరకు ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12,692 మంది ప్రయాణికులకు ఆర్‌జిఐఎలో ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేశారు. వారిలో 144 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 44 మందికి ఒమిక్రాన్ నెగెటివ్‌గా తేలింది. మిగిలిన 100 మందిలో ఇప్పటివరకు 79 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 21 మంది ఫలితాలు రావాల్సి ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్ బాధితుల్లో 27 మంది కోలుకున్నారు.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28,886 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 317 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,82,215కి చేరింది. ఈ మేరకు శనివారం వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,029కు చేరింది. తాజాగా కరోనా నుంచి 232 మంది కోలుకోగా, ఇప్పటివరకు 6,74,453 మంది కోలుకున్నారు.రాష్ట్రంలో రికవరీ రేటు 98.86 శాతంగా నమోదు కాగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News