Sunday, May 5, 2024

ఎపిలో కొత్తగా 182 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

another 135 infected corona in andhra pradesh

అమరావతి: ఎపిలో కరోనా పాజిటవ్ కేసులు రోజురోజుకూ పెరుగున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 11,602 శాంపిళ్లను పరీక్షించగా కొత్తగా 182 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్త కేసుల్లో 135 మంది ఎపికి చెందినవారు కాగా… ఇతర రాష్ట్రాలకు నుంచి ఎపికి వచ్చిన మరో 38 మంది ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారినలో 9మందికి కోవిడ్ సోకింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,261కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 1,641 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 2,540 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఎపి మృతుల సంఖ్య 80కి చేరింది. గత 24గంటల్లో 65 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారని హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

another 135 infected corona in andhra pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News