Thursday, May 16, 2024

ఎపి సిఎస్ పదవీ కాలం మరో ఆరునెలలు పొడగింపు

- Advertisement -
- Advertisement -

AP CS Sameer Sharma tenure extended

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీకాలం పొడిగిస్తూ ఆదివారం నాడు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. సమీర్‌శర్మను మరో 6 నెలలు పాటు ఎపి సిఎస్‌గా కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. వచ్చే ఏడాది మే నెల వరకు ఆయన సిఎస్‌గా పనిచేయనున్నారు. కాగా సమీర్‌శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ ఎపి ప్రభుత్వం ఈనెల 2వ తేదీన కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడంతో పొడిగింపు ప్రతిపాదనను ఆమోదిస్తూ సంబంధిత ఉత్తర్వులను జారీచేసింది. కాగా రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ సిఎస్‌గా సమీర్‌శర్మ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా కేంద్రం మరో ఆరునెలలు పొడగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News