Monday, May 6, 2024

ఏపిలో టికెట్ ధరల పరిశీలనకు కొత్త కమిటీ

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల పరిశీలనకు కొత్త కమిటీని నియమించింది. ఈ మేరకు ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి ఏపి హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా రెవెన్యూ, ఆర్థిక, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, సమాచార శాఖ కమీషనర్, న్యాయశాఖ కార్యదర్శి ఉంటారు. టికెట్ల ధరలపై ఈ కమిటీ పరిశీలన జరిపి ఏపి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఇదిలా ఉండగా ఏపి మంత్రి పేర్ని నానితో ఆ రాష్ట్ర సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 19 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో సినిమా టికెట్ ధరలు, థియేటర్ల ఇబ్బందులపై చర్చ జరిగింది.

AP Movie Distributors meet Minister Perni Nani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News