Sunday, April 28, 2024

భారత్‌-పాక్‌ మధ్య కాల్పులు: జవాను మృతి

- Advertisement -
- Advertisement -

Army jawan killed in firing as Pakistan in Rajouri

జమ్ముకశ్మీర్: పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. సరిహద్దుల్లో పాక్ మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. బుధవారం రాత్రి నుంచి పలుచోట్ల పాక్ రేంజర్లు కాల్పులు జరుపుతున్నారు. మంజకోట్‌, కేరీ, బాలాకోట్, కరోల్ మైట్రాన్‌ సెక్టార్లలో పాకిస్థాన్ కాల్పులు జరుపుతోంది. పాక్ కాల్పులను భారత్ తిప్పికొడుతోంది. పాక్ రేంజర్ల జరిపిన కాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందగా… మరో జవానుకు తీవ్రగాయలయ్యాయి. భారత జవాన్ మంజకోట్‌ సెక్టార్‌ వద్ద చనిపోయినట్టు అధికారులు తెలిపారు. మంజకోట్‌లో గత రాత్రి నుంచి కాల్పులు జరుగుతున్నాయి.

Army jawan killed in firing as Pakistan in Rajouri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News