Saturday, April 27, 2024

సైనికుడి తండ్రిని నరికి చంపి… భార్యపై…

- Advertisement -
- Advertisement -

Army man's father killed at Uttarpradesh

లక్నో: భూవివాదంలో ఓ భారత సైనికుడి తండ్రిని చంపిన అనంతరం అతడి భార్యపై దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీలోని మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సూర్య ప్రకాశ్ అనే జవాను జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడు తండ్రి రాజేంద్ర మిశ్రా(55), అతడి భార్య యుపిలోని సంగ్రామ్ పూర్ ప్రాంతంలోని తెంగా షుఖుల్‌పూర్ గ్రామంలో ఉంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి సూర్య ప్రకాశ్ కుటుంబానికి, అశోక్ శుక్లా మధ్య భూవివాదం నడుస్తోంది. అశోక్ మంగళవారం సూర్య ప్రకాశ్ ఇంటికి వెళ్లి గర్భంతో ఉన్న భార్యపై శుక్లా దాడి చేసిన అనంతరం కత్తితో రాజేంద్ర ప్రసాద్‌ను నరికాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో శుక్లాతో మరికొందరు ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News